Daily Archives: June 24, 2013

శంకర్ తో పాట్లు పడుతున్న ఆమీ జాక్సన్

amy-jackson-350_020612115429-1

ప్రస్తుతం దక్షినాది సినిమాలలో ఆమీ జాక్సన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈమెతో చెయ్యడానికి చాలా మంది యువ హీరోలు, పెద్ద హీరోలు కూడా ముచ్చట పడుతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రం హీరో గా రూపొందుతున్న “ఐ” సినిమాలో అమీ నటిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే నటనకు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో తమిళంలో సుదిర్గ డైలాగ్స్ చెప్పడానికి అమీ జాక్సన్ నానాపాట్లు పడుతుందట. ఆమె కు తమిళం నేర్పించి, ఏదో విధంగా ఈ షూటింగ్ అయింది అనిపిద్దామని దర్శకుడు శంకర్ తో పాటు యూనిట్ సభ్యులు అంతా అమీ కి నటన నేర్పించే కార్యక్రమం చేపట్టారట. హాట్ లుక్స్ తోటి బికినీ లు కూడా వేసుకోవడానికి రెడీ అయిన ఆమీ, నటించమంటే మటుకు శంకర్ కు చుక్కలు చుపెడుతుందట. సినిమా మధ్యలో ఉంది కాబట్టి ఈమెను తొలగించడం సాధ్యం కాక ఏదో విధంగా ఈమెకు నటనా, తమిళం నేర్పే పనిలో హీరో విక్రం, శంకర్ బిజీ గా ఉన్నారట. ఇంతకీ ప్రస్తుతం రామ్ చరణ్ తో “ఎవడు” లో నటిస్తున్న ఆమీ, తెలుగులో ఎలా ఇరగదిస్తుందో చూడాలి.

సిద్ధార్ద్ కు తెలుగు ప్రేక్షకులు నచ్చలేదు….!

sidhu

తెలుగు సినిమాల ద్వారా స్టార్ స్టేటస్ సంపాదించి, దాదాపు 8 ఏళ్ళుగా తెలుగు సినిమాలనే ఎక్కువగా చేసిన హీరో సిద్ధార్ద్ కు తెలుగు ప్రేక్షకులు హటాత్తు గా నచ్చడంలేదు. నిన్న చెన్నై లో హీరో సిద్ధూ తెలుగు ప్రేక్షకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి దుమారాన్ని లేపాడు. ఇటీవల సిద్ధూ హీరోగా నటించిన “సమ్ థింగ్ సమ్ థింగ్” తెలుగు లో విడుదల అయి పెద్దగా ప్రజాదరణ పొందలేదు. ఈ విషయమై పత్రికల వారితో నిన్న చెన్నై లో మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారని, మిగతా సినిమాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. అంతేకాదు తన సినిమాలు టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్ లోనే బాగా ఆడుతున్నాయి అని కూడా చెప్పాడు.

మరి ఇదే సంవత్సరం చిన్న సినిమాలుగా విడుదల అయి పెద్ద సినిమాల రేంజ్ కి ఎదిగిన “స్వామి రారా”, ‘గుందేజారి గల్లంతైందే’, ‘ప్రేమ కధా చిత్రం’ విజయాల గురించి సిద్ధార్ద్ కు తెలియదా..? లేక అవగాహన లేకుండా ఇలాంటి సుదీర్గ అనుభవం ఉన్న హీరో మాట్లాడుతున్నాడా..? అని అందరినీ ఆశ్చర్య పరస్తోంది. బహుశా తన సినిమాలు వరసగా తెలుగులో పరాజయం పొందడంతో నిరాశ గా సిద్ధూ ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవాలి.

అఖిల్ ఎంట్రీ ని షురూ చేసిన నాగార్జున

akhil

మొన్న శనివారం రాజధాని లో జరిగిన “అడ్డా” సినిమా ఆడియో వేడుకలో నాగార్జున అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ని అధికారికంగా ప్రకటించాడు. అడ్డా ఆడియో వేడుకలో అతిధిగా పాల్గొన్న నాగ్ మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం జరగబోయే అఖిల్ సినిమా ఆడియో వేడుకకు కూడా ఇంతకంటే ఎక్కువగా జనం రావాలి, అని నాగ్ చెప్పడంతో వచ్చే సంవత్సరమే అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న విషయం స్పష్టం అయిపొయింది. ఇంతకీ ఈ సినిమాను ఎవరు దర్శకత్వం వహిస్తారు..? అన్న విషయంపై రకరకాల ఉహగాలు అప్పుడే మొదలు అయి పోయాయి. రాజమౌళి దర్శకత్వంలో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది, అన్న ప్రచారం ఆ మధ్య జరిగినా, 2015 వరకూ రాజమౌళి బాహుబలి తోనే ఉంటాడు కాబట్టి అఖిల్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తాడు అన్న విషయం ఇక అధికారికంగా లేనట్లే.

ఇక పోతే ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ దర్శకులుగా వెలుగొందుతున్న వినాయక్, పూరి జగన్నాద్, శ్రీను వైట్ల లాంటి దర్శకుల వైపు నాగ్ మొగ్గు చుపుతాడా..? లేక క్రియేటివ్ దర్శకులుగా పేరుగాంచిన శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకుల చేతిలో అఖిల్ భవిష్యత్ ను నాగార్జున పెడతాడా..? అనే విషయాలపై ఎవరికి తోచిన ఉహాగానాలు వారు రాస్తున్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం విరేవ్వరు కాకుండా ఓ కొత్త దర్శకుడితో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా 2014 సంవత్సరంలో టాలీవుడ్ కు మరో కొత్త హీరో రాబోతున్నడన్న విషయం స్పష్టం అయి పొయింది.

బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ చేస్తున్న ఛార్మి….!

charmi

పంజాబీ బ్యూటీ ఛార్మి ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో టాలీవుడ్ లో కొన్ని పెద్ద సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ, మరికొన్ని సినిమాలలో వేశ్య పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తోంది. తనలాగే ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాని ప్రియమణి, శ్రియలు బాలీవుడ్ లో  ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఉండడంతో ఛార్మి దృష్టి బాలీవుడ్ సినిమాల ఐటమ్ సాంగ్స్ పై పడింది. ఆమె ప్రస్తుతం “రాంబో రాజకుమార్” అనే సినిమాలో ఒక ప్రత్యేక గీతాన్ని చేయడానికి ఒప్పుకుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు.

ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీహరి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఛార్మి గతంలో “జిల్లా గజియాబాద్”, “బుడ్డా హోగా తేరే బాప్” చిత్రాలలో నటించినా పెద్ద గా గుర్తింపు తెచ్చుకోలేకపొయింది. ఇక లాబం లేదు అనుకుంది కాబోలు తాను కూడా ప్రియమణి బాట పట్టి బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ కు సై అంది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ ముంబాయ్ లో జరుగుతుందని సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ బ్యూటీ ని నందమూరి బాలయ్య సినిమాకు కధానాయికగా ఎంపిక చేశారు అన్న విషయం తెలిసిందే.

షాపింగ్ మాల్ చూసి భయపడుతున్న సోనాక్షి…!

sonakshi

బాలీవుడ్ నిర్మాతలు తాము తీసే సినిమాలకు కధలకంటే ప్రచారానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. తమ సినిమాలలో నటించిన హీరోయిన్స్ ను తీసుకొని దేశంలోని వివిధ నగరాలలతో పాటు విదేశాలలో ప్రచార కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడానికి సోనాక్షి సిన్హా ఒక షరతు పెట్టింది. ఆ షరతు ఏమిటంటే, తాను నటించిన సినిమాల నిమిత్తం జరిగే ప్రచార కార్యక్రమాలలో బాగంగా షాపింగ్ మాల్స్ లో ఏర్పాటు చేసే కార్యక్రమాలకు తాను హాజరు కానని, నిర్మాతలకు ఖరాఖండిగా చేపుతుందట.

దీనికి ప్రధాన కారణం ఈమధ్య తన సినిమా ప్రచార నిమిత్తం ముంబాయ్ లో ఒక షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనాక్షి పాల్గోనప్పుడు చాలామంది అభిమానులు సోనాక్షి దగ్గరకు దూసుకువచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను గిల్లారట. ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి సోనాక్షి షాపింగ్ మాల్స్ అంటేనే భయపడుతుంది. ఈమధ్య “ఒన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ ముంబాయ్ దోబారా” సినిమాను నిర్మించిన బాలాజీ సంస్థ దుబాయ్ లో ఒక షాపింగ్ మాల్ లో  ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకుంటే, మాల్స్ కు తాను రానని సోనాక్షి షరతులు పెట్టిందట. దీనితో సోనాక్షి మాల్స్ అంటే భయపడిపోతోంది అంటూ బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

Singam (Yamudu 2) Promo Video Songs – readandhra.com

Surya “Singham” Movie Audio Function Photos

“ADDA” Movie Audio Launch Photos