Blog Archives

బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ చేస్తున్న ఛార్మి….!

charmi

పంజాబీ బ్యూటీ ఛార్మి ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో టాలీవుడ్ లో కొన్ని పెద్ద సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ, మరికొన్ని సినిమాలలో వేశ్య పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తోంది. తనలాగే ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాని ప్రియమణి, శ్రియలు బాలీవుడ్ లో  ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఉండడంతో ఛార్మి దృష్టి బాలీవుడ్ సినిమాల ఐటమ్ సాంగ్స్ పై పడింది. ఆమె ప్రస్తుతం “రాంబో రాజకుమార్” అనే సినిమాలో ఒక ప్రత్యేక గీతాన్ని చేయడానికి ఒప్పుకుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు.

ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీహరి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఛార్మి గతంలో “జిల్లా గజియాబాద్”, “బుడ్డా హోగా తేరే బాప్” చిత్రాలలో నటించినా పెద్ద గా గుర్తింపు తెచ్చుకోలేకపొయింది. ఇక లాబం లేదు అనుకుంది కాబోలు తాను కూడా ప్రియమణి బాట పట్టి బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ కు సై అంది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ ముంబాయ్ లో జరుగుతుందని సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ బ్యూటీ ని నందమూరి బాలయ్య సినిమాకు కధానాయికగా ఎంపిక చేశారు అన్న విషయం తెలిసిందే.