అఖిల్ ఎంట్రీ ని షురూ చేసిన నాగార్జున
మొన్న శనివారం రాజధాని లో జరిగిన “అడ్డా” సినిమా ఆడియో వేడుకలో నాగార్జున అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ని అధికారికంగా ప్రకటించాడు. అడ్డా ఆడియో వేడుకలో అతిధిగా పాల్గొన్న నాగ్ మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం జరగబోయే అఖిల్ సినిమా ఆడియో వేడుకకు కూడా ఇంతకంటే ఎక్కువగా జనం రావాలి, అని నాగ్ చెప్పడంతో వచ్చే సంవత్సరమే అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న విషయం స్పష్టం అయిపొయింది. ఇంతకీ ఈ సినిమాను ఎవరు దర్శకత్వం వహిస్తారు..? అన్న విషయంపై రకరకాల ఉహగాలు అప్పుడే మొదలు అయి పోయాయి. రాజమౌళి దర్శకత్వంలో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది, అన్న ప్రచారం ఆ మధ్య జరిగినా, 2015 వరకూ రాజమౌళి బాహుబలి తోనే ఉంటాడు కాబట్టి అఖిల్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తాడు అన్న విషయం ఇక అధికారికంగా లేనట్లే.
ఇక పోతే ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ దర్శకులుగా వెలుగొందుతున్న వినాయక్, పూరి జగన్నాద్, శ్రీను వైట్ల లాంటి దర్శకుల వైపు నాగ్ మొగ్గు చుపుతాడా..? లేక క్రియేటివ్ దర్శకులుగా పేరుగాంచిన శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకుల చేతిలో అఖిల్ భవిష్యత్ ను నాగార్జున పెడతాడా..? అనే విషయాలపై ఎవరికి తోచిన ఉహాగానాలు వారు రాస్తున్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం విరేవ్వరు కాకుండా ఓ కొత్త దర్శకుడితో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా 2014 సంవత్సరంలో టాలీవుడ్ కు మరో కొత్త హీరో రాబోతున్నడన్న విషయం స్పష్టం అయి పొయింది.
Posted on June 24, 2013, in Telugu, Telugu Cinema and tagged akhil, akhil tollywood entry, akkineni akhil, akkineni akhil tollywood, akkineni nagarjuna, NAGARJUNA, tollywoood entry. Bookmark the permalink. Leave a comment.
Leave a comment
Comments 0