Blog Archives

అఖిల్ ఎంట్రీ ని షురూ చేసిన నాగార్జున

akhil

మొన్న శనివారం రాజధాని లో జరిగిన “అడ్డా” సినిమా ఆడియో వేడుకలో నాగార్జున అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ని అధికారికంగా ప్రకటించాడు. అడ్డా ఆడియో వేడుకలో అతిధిగా పాల్గొన్న నాగ్ మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం జరగబోయే అఖిల్ సినిమా ఆడియో వేడుకకు కూడా ఇంతకంటే ఎక్కువగా జనం రావాలి, అని నాగ్ చెప్పడంతో వచ్చే సంవత్సరమే అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న విషయం స్పష్టం అయిపొయింది. ఇంతకీ ఈ సినిమాను ఎవరు దర్శకత్వం వహిస్తారు..? అన్న విషయంపై రకరకాల ఉహగాలు అప్పుడే మొదలు అయి పోయాయి. రాజమౌళి దర్శకత్వంలో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది, అన్న ప్రచారం ఆ మధ్య జరిగినా, 2015 వరకూ రాజమౌళి బాహుబలి తోనే ఉంటాడు కాబట్టి అఖిల్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తాడు అన్న విషయం ఇక అధికారికంగా లేనట్లే.

ఇక పోతే ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ దర్శకులుగా వెలుగొందుతున్న వినాయక్, పూరి జగన్నాద్, శ్రీను వైట్ల లాంటి దర్శకుల వైపు నాగ్ మొగ్గు చుపుతాడా..? లేక క్రియేటివ్ దర్శకులుగా పేరుగాంచిన శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకుల చేతిలో అఖిల్ భవిష్యత్ ను నాగార్జున పెడతాడా..? అనే విషయాలపై ఎవరికి తోచిన ఉహాగానాలు వారు రాస్తున్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం విరేవ్వరు కాకుండా ఓ కొత్త దర్శకుడితో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా 2014 సంవత్సరంలో టాలీవుడ్ కు మరో కొత్త హీరో రాబోతున్నడన్న విషయం స్పష్టం అయి పొయింది.

తప్పు దిద్దుకుంటున్న నాగార్జున…!

Akkineni family heroesవరస ఫ్లాప్ లతో విసిగిపోయిన నాగార్జున తన పద్ధతి పూర్తిగా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం నాగ్ హిట్ డైరెక్టర్ కనిపిస్తే చాలు వెంటనే అందరికంటే ముందే నాగ్ ఆ డైరెక్టర్ ను కబ్జా చేసేస్తున్నాడు. తన కొడుకు నాగచైతన్య కు హిట్ ఇచ్చిన దర్శకుడు డాలి ని అందరికంటే తానే ముందు అడ్వాన్స్ బుకింగ్ లో తన వైపు తిప్పేసుకున్నాడు మన వెండితెర మన్మధుడు.

ఇక “పూలరంగడు” సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం చౌదరి ని కూడా అందరికంటే ముందే క్యాచ్ చేసి తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై “భాయి” సినిమాను ఆ దర్శకుడి చేత చుట్టించేస్తున్నాడు. ఇది ఇలా ఉండగానే ఇష్క్ సినిమా తో హిట్ కొట్టిన విక్రం కుమార్ ను కూడా సొంతం చేసుకొని అక్కినేని కుటుంబ చిత్రం అంటూ “మనం” సినిమాలో అక్కినేని మూడు తరాల మేజిక్ ను తెలుగు ప్రేక్షకులకు చుపించబోతున్నాడు. స్వతహాగా మంచి వ్యపారావేత్తగా పేరున్న నాగార్జున తన తెలివితేటలకు బాగా పదును పెట్టి నేటి టాలీవుడ్ ను ఏలుతున్న కుర్రహేరోలకు సవాలు విసరడమే కాకుండా అక్కినేని స్టామినాను చాటుతున్నాడు. సినిమా సినిమాకు ఎంపికలో వెరైటీ చూపెడుతున్న నాగార్జున ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుందాం…….

వందశాతం వెబ్ రైటింగ్ పొందుతున్న “జగద్గురు ఆదిశంకర”

sri-jagadguru-adi-shankara-10632పేస్ బుక్ లో,వెబ్ సైట్ లలో ఏ సినిమా పాటలకు వందశాతం మార్కులు పడవు. కాని జగద్గురు ఆదిశంకర సినిమా ఆడియోకు మాత్రం అన్ని వెబ్ సైట్స్  వందశాతం రేటింగ్ ఇస్తున్నాయి. 32 ఏళ్ళ వయసులో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ కాలినడకన తిరిగి హిందూ మత అవోనత్యాన్ని ప్రపంచానికి చాటిన కారణ జన్ముడు ఆదిశంకరాచార్య. జె.కే.బారవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కౌశిక్ బాబు ఆదిశంకరుడిగా నటిస్తుంటే, అక్కినేని నాగార్జున,మోహన్ బాబు,శ్రీహరి లాంటి ఎందరో ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. శంకరాభరణం,అన్నమయ్య మరువాత ఆ రేంజ్ లో ఈ సినిమా విజయం తధ్యం అనే టాక్ అప్పడే వినపడుతోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ సినిమా స్థాయి ని తెలియ జేస్తోంది. ఈ సినిమాను వ్యాపార పరంగా కూడా చాలా ప్లాన్డ్ గా విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మంచి కధతో పాటు, టెక్నికల్ గా కూడా మంచి విలువలతో ఈ సినిమా నిర్మింప బడడంతో ఈ సినిమా ఒకనాటి అన్నమయ్య స్థాయి అందుకొనే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.