Blog Archives

బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ చేస్తున్న ఛార్మి….!

charmi

పంజాబీ బ్యూటీ ఛార్మి ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో టాలీవుడ్ లో కొన్ని పెద్ద సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ, మరికొన్ని సినిమాలలో వేశ్య పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తోంది. తనలాగే ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాని ప్రియమణి, శ్రియలు బాలీవుడ్ లో  ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఉండడంతో ఛార్మి దృష్టి బాలీవుడ్ సినిమాల ఐటమ్ సాంగ్స్ పై పడింది. ఆమె ప్రస్తుతం “రాంబో రాజకుమార్” అనే సినిమాలో ఒక ప్రత్యేక గీతాన్ని చేయడానికి ఒప్పుకుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు.

ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీహరి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఛార్మి గతంలో “జిల్లా గజియాబాద్”, “బుడ్డా హోగా తేరే బాప్” చిత్రాలలో నటించినా పెద్ద గా గుర్తింపు తెచ్చుకోలేకపొయింది. ఇక లాబం లేదు అనుకుంది కాబోలు తాను కూడా ప్రియమణి బాట పట్టి బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ కు సై అంది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ ముంబాయ్ లో జరుగుతుందని సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ బ్యూటీ ని నందమూరి బాలయ్య సినిమాకు కధానాయికగా ఎంపిక చేశారు అన్న విషయం తెలిసిందే.

షాపింగ్ మాల్ చూసి భయపడుతున్న సోనాక్షి…!

sonakshi

బాలీవుడ్ నిర్మాతలు తాము తీసే సినిమాలకు కధలకంటే ప్రచారానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. తమ సినిమాలలో నటించిన హీరోయిన్స్ ను తీసుకొని దేశంలోని వివిధ నగరాలలతో పాటు విదేశాలలో ప్రచార కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడానికి సోనాక్షి సిన్హా ఒక షరతు పెట్టింది. ఆ షరతు ఏమిటంటే, తాను నటించిన సినిమాల నిమిత్తం జరిగే ప్రచార కార్యక్రమాలలో బాగంగా షాపింగ్ మాల్స్ లో ఏర్పాటు చేసే కార్యక్రమాలకు తాను హాజరు కానని, నిర్మాతలకు ఖరాఖండిగా చేపుతుందట.

దీనికి ప్రధాన కారణం ఈమధ్య తన సినిమా ప్రచార నిమిత్తం ముంబాయ్ లో ఒక షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనాక్షి పాల్గోనప్పుడు చాలామంది అభిమానులు సోనాక్షి దగ్గరకు దూసుకువచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను గిల్లారట. ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి సోనాక్షి షాపింగ్ మాల్స్ అంటేనే భయపడుతుంది. ఈమధ్య “ఒన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ ముంబాయ్ దోబారా” సినిమాను నిర్మించిన బాలాజీ సంస్థ దుబాయ్ లో ఒక షాపింగ్ మాల్ లో  ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకుంటే, మాల్స్ కు తాను రానని సోనాక్షి షరతులు పెట్టిందట. దీనితో సోనాక్షి మాల్స్ అంటే భయపడిపోతోంది అంటూ బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ ను బుట్టలో పడేస్తున్న మిల్కీబ్యూటీ…!

tamanna

మొట్టమొదటి సినిమా పరాజయం పాలు అయితే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ కెరియర్ అయిపొయింది అంటారు. కాని తమన్నా విషయంలో ఇది పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. హిమ్మత్ వాలా పరాజయం తరువాత ఇంక అక్కడ తనకు పని లేదని నిర్ణయి౦చుకొని దక్షినాది సినిమాలలో నటిస్తున్న తమన్నా కు బాలీవుడ్ నుండి పిలుపులు మీద పిలుపులు వచ్చేస్తున్నాయి. హిమ్మత్ వాలా సినిమాను దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్ తను తదుపరి తీయబోతున్న సినిమాలో ఈ మిల్కీ బ్యూటీ నే హీరోయిన్ గా ఎంచుకున్నాడు. ఇప్పటికే తమన్నా అందాలకు పడిపోయిన అక్షయ్ కుమార్ తన కొత్త సినిమాలో తమన్నా కు ఛాన్స్ ఇచ్చాడు. అంతేందుకు అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా తనకు తమన్నా యే కలిసి వచ్చిందని చేపుతున్నాడు అంటే ఈ మిల్కీ బ్యూటీ ఎవరినైనా బుట్టలో పడేయగలదని తెలుస్తోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో తమన్నా ప్రస్తుతం మంచి జోష్ మీద ఉంది.

బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ ఆత్మహత్య

images (1)బాలీవుడ్లో వచ్చిన ‘గజినీ’, ‘నిశ్శబ్ద్’ సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయిన హీరోయిన్ జియా ఖాన్ తనకు తనే ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న జియా ఖాన్ ఇంట్లో జరిగింది. ఈ 25 ఏళ్ళ హీరోయిన్ కి ముందు ముందు మంచి కెరీర్ ఉంది అలాగే ఇప్పటికే ఆమె తన లుక్స్, నటనతో, ప్రవర్తనతో అందరి నుండి ప్రశంశలు అందుకుంది.ప్రస్తుతం జియా ఖాన్ ఎదుర్కొంటున్న పర్సనల్ ఇబ్బందులు, కెరీర్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల వల్లే ఆమె ఆత్మహత్యకి పాల్పడి ఉంటుందని సమాచారం. ఈ వార్త ఒక్క సారిగా ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. జియా ఖాన్ అసలు పేరు నఫీస ఖాన్. స్వతహాగా బ్రిటన్ లో పుట్టి పెరిగిన ఈ భామ 2007 లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Top Bollywood Celebs at the 4th anniversary party of COLORS Channel Photos